నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో గల సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు. గత 2019 పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సైతం ఇక్కడే జరిగిందని తెలియజేశారు.