ఎడపల్లి మండలం ధర్మారంలో చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. ధర్మారం గ్రామానికి చెందిన ప్రశాంత్ (25) 10 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. శుక్రవారం చెరువులో మృతదేహం తేలడంతో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.