వాటర్‌ హీటర్‌తో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి

83చూసినవారు
వాటర్‌ హీటర్‌తో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మహ్మద్‌ నగర్‌ మండలం తుంకిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రౌతు సాయిలు(53) హైదరాబాద్‌ వెళ్లేందుకు ఉదయం 4.30 గంటలకు నిద్రలేచారు. స్నానం చేసేందుకు బకెట్‌లో వాటర్‌ హీటర్‌ పెట్టారు. ఈ క్రమంలో ఆయనకు విద్యుదాఘాతం కావడంతో మృతి చెందారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్