నవీపేట్: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

76చూసినవారు
నవీపేట్: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
నవీపేట్ కు చెందిన సంజీవ్ కుమార్ (50) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ జరుపుకొని రాత్రి బయటకు వెళ్లిన సంజీవ్ కుమార్ తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఆదివారం నవీపేట్ నుంచి కందకుర్తి వెళ్లే దారి కల్వర్టు కింద మృతదేహం లభ్యమైందిన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్