నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 4 సెల్ ఫోన్లు, రూ. 3,660 నగదును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.