నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన్ని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం స్వీకరించిన అమిత్ షా, ప్రారంభ వేడుకలో బోర్డు అధికారిక లోగోను ఆవిష్కరించనున్నారు.