వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన సమ్రీన్ అనే మహిళకు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో పురిటి నొప్పులు రాగా వేల్పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ప్రాంతీయ ఆసుపత్రికి భీంగల్ 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికం కాగా ఈఎంటి త్రిషాల, తిరుపతి ప్రాథమిక చికిత్స చేసి కాన్పు జరిపగా సమ్రీన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు తరువాత తల్లీబిడ్డలను ఆర్మూర్ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చమని సిబ్బంది తెలిపారు.