నిజామాబాద్ జిల్లా కేంద్రం మహాలక్ష్మినగర్, సాయిటవర్స్ రోడ్డు వాహన దారులకు చుక్కలు చూపిస్తోంది. 20 మీటర్ల రోడ్డులో అడుగుకు ఓ గుంత ప్రత్యక్ష నరకం చూపెడుతుంది. 20 మీటర్ల రోడ్డులో 100కు పైగా గుంతలు ఏర్పడ్డాయి. ఆ గతుకుల రోడ్డులో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.