నిజామాబాద్: స్కానింగ్ సెంటర్ లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

76చూసినవారు
నిజామాబాద్: స్కానింగ్ సెంటర్ లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
స్కానింగ్ సెంటర్ లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ హెచ్చరించారు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ పైన అదనపు కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొత్తగా మూడు స్కానింగ్ కేంద్రాలకు అనుమతి, రెండు స్కానింగ్ కేంద్రాలకు రిన్యూవల్, బోధన్ డివిజన్ లోని ఒక స్కానింగ్ కేంద్రాన్ని మూసివేసేందుకు అదనపు కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్