నిజామాబాద్: బైక్ దొంగ అరెస్ట్

56చూసినవారు
నిజామాబాద్: బైక్ దొంగ అరెస్ట్
నిజామాబాద్ జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ బస్టాండ్ వద్ద డిచ్ పల్లి మండలం నడిపల్లిలోని గాంధీనగర్ కు చెందిన సయ్యద్ మజద్ బైక్ దొంగను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఎస్.హెచ్.వో రఘపతి శుక్రవారం తెలిపారు. బోధన్ బస్టాండ్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అటుగా వెళుతున్న బైకులు డాక్యుమెంట్స్ చెక్ చేయగా సరైన పత్రాలు చూపించక అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా.. గతంలో కూడా మూడు సార్లు బైక్ లు దొంగతనం చేసినట్లు చెప్పారు. ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా, కోర్టు రిమాండ్ విధించగా, జైలుకు తరలించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్