నిజామాబాద్: సైన్యంకు అండగా నిలబడుద్దాం

76చూసినవారు
నిజామాబాద్: సైన్యంకు అండగా నిలబడుద్దాం
మన దేశానికి, పాకిస్థాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైనికులకు అండగా నిలుద్దామని సినీనటి పూనమ్ కౌర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడ బ్రహ్మకుమారి "ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారత సైనికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడుతున్నారని చెప్పారు. సైనికులకు మనమంతా మద్దతు తెలుపుతూ అండగా నిలవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్