

జవాన్ వీరమరణం.. గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులు (వీడియో)
AP: జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన కాల్పుల్లో ఏపీ జవాన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి సరిహద్దుల వెంట జరిపిన కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. జవాన్ మృతితో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి తెప్పించింది.