నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఎన్నికలు ఈనెల 25న జరుగనున్నాయి. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్యానెల్లో అధ్యక్షుడిగా పెంటం దత్తాద్రి (పౌటీ చేయనున్నారు. ప్రధాన కార్యదర్శిగా చోటి భూమేష్, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, కన్నా దుబ్బ రాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బీజీ ప్రసాద్, భూస రవి, ఎనుగందుల సుభాష్, కోశాధికారిగా మోర సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కస్తూరి గంగరాజు, ప్రచార కార్యదర్శిగా బూస శ్రీనివాస్ మార్కండేయ మందిరంలో నామినేషన్లు దాఖలు చేశారు.