నిజామాబాద్: బాలికను ప్రేమ పేరుతో వేధించిన ఓ యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు బుధవారం నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వినాయక్ నగర్ కు చెందిన ఓ యువకుడు నాలుగో టౌన్ పరిధికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలపగా.. నాలుగవ టౌన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.