మానసిక దివ్యాంగుల, అంధుల ప్రత్యేక పాఠశాలలకు సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుందని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య తెలిపారు. గురువారం స్నేహ సొసైటీలో దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు 275 మంది దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందిస్తున్నామని వెల్లడించారు.