రాజారాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చిన్నబు రాంభూపాల్ ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సభ్యులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొని అభినందనలు తెలిపారు. స్టేడియానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం సహకరిస్తానని రాంభూపాల్ తెలిపారు.