

పూరీలోని జగన్నాథ ఆలయంలో భద్రత పెంపు (VIDEO)
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సందేహాస్పదంగా కనిపించే వాహనాలు, వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. భక్తుల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామని, భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు.