ప్రమాదవశాత్తు కుంటలో పడి యువకుడు మృతి

67చూసినవారు
ప్రమాదవశాత్తు కుంటలో పడి యువకుడు మృతి
బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో కాలు జారిపడి ఓ యువకుడు మృతి చెందినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎస్ఐ శుక్రవారం మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన కమ్మరి చింటు (18) బహిర్భూమికి వెళ్లి గ్రామ శివారులోని మేకల వారి కుంటలో శవమై తేలుతూ కనిపించాడని తండ్రి కమ్మరి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్