లింగంపేట మండలంలోని శెట్ పల్లి, అయ్యపల్లి, పర్మల్ల తదితర గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులతో పాటు భారీ వడగళ్ల వర్షం కురిసింది. దీంతో మార్కెట్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఈ భారీ వడగళ్ల వర్షంతో పొలాలలో వడ్లు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.