AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 58,872 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, శుక్రవారం క్యూలైన్లోకి భక్తుల అనుమతి నిలిపివేశారు. తిరిగి శనివారం ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లోని భక్తులకు అనుమతి లేదని టీటీడీ అలెర్ట్ జారీచేసింది.