కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంద జన్మలెత్తినా రేవంత్రెడ్డికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదన్నారు. రేవంత్ గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినవాడు కేసీఆర్ అని అన్నారు. ఆ జేజమ్మను ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్ అని, కాబట్టి రేవంత్ చిల్లర ప్రభుత్వం ఏం చేసినా ఆయన వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ ఫైర్ అయ్యారు.