చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ న్యూస్, తుర్కియేకు చెందిన మీడియా సంస్థ టీఆర్టీ వరల్డ్కు చెందిన ‘ఎక్స్’ హ్యాండిల్స్ భారత్లో నిలిచిపోవడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాటిని నిలిపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అసలు ‘ఎక్స్’ వాటిని ఎందుకు నిలిపేయాల్సి వచ్చిందో కారణాలు తెలుసుకుంటున్నామని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.