కేంద్రం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల నిత్యావసరాలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దేశవ్యాప్తంగా కావాల్సినన్ని నిత్యావసర సరుకులు నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల ఆహార అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే కొంతమంది నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుంది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.