"వాగులు, వంకలు, నదులు, చెరువులపై కేసీఆర్కు ఉన్న అవగాహన దేశంలో ఇంకెవరికీ లేదు. ఇరిగేషన్ విషయమై కేసీఆర్ను అడగడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే" అని కేటీఆర్ మీడియా ముందు అన్నారు. ధర్మం, న్యాయం చివరికి గెలుస్తాయని, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలపై నాయకులను నిలదీయాలని పులుపునిచ్చారు.