స్వర్ణదేవాలయం ప్రాంగణంలో గగనతల రక్షణ ఆయుధాల మోహరింపు గురించి వచ్చిన వార్తలను భారత సైన్యం ఖండించింది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో అమృత్సర్లోని స్వర్ణదేవాలయం (శ్రీ దర్బార్ సాహిబ్) ప్రాంగణంలో ఎలాంటి గగనతల రక్షణ ఆయుధాలు మోహరించలేదని ఇండియర్ ఆర్మీ స్పష్టం చేసింది. ఆలయ నిర్వాహకులు కూడా సైన్యానికి అటువంటి అనుమతి ఇవ్వలేదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) స్పష్టం చేసింది.