పూజా హెగ్డే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత స్టార్ హీరోల పక్కన నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం పూజా బాలీవుడ్, కోలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారందరూ థియేటర్కు వెళ్లి సినిమాలు చూడరని అన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్కు, థియేటర్ ఫ్యాన్స్కు చాలా తేడా ఉంటుందన్నారు.