తిరుమలలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్లే వారి రక్షణ దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉ.5 నుంచి మ.2 గంటల వరకు అనుమతిస్తోంది. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. మధ్యాహ్నం నుంచి 70-100 మందితో గుంపులుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.