ఇక 1-5 తరగతుల విద్యార్థులకూ నోట్‌ పుస్తకాలు

54చూసినవారు
ఇక 1-5 తరగతుల విద్యార్థులకూ నోట్‌ పుస్తకాలు
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1-5 తరగతుల విద్యార్థులకూ ఈసారి నుంచి నోట్‌ పుస్తకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలో 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. 1-2 తరగతుల విద్యార్థులకు మూడు, 3-5 తరగతుల వారికి నాలుగు చొప్పున నోట్‌ పుస్తకాలు అందజేస్తారు. వర్క్‌బుక్‌లతోపాటు నోట్‌ పుస్తకాలను అదనంగా ఇవ్వనున్నారు. ఈనెల 15 నుంచి వాటిని జిల్లాలకు సరఫరా చేస్తారు.

సంబంధిత పోస్ట్