ఎగ్జిమ్ బ్యాంక్ 2025కు సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 ఖాళీలకు ప్రకటన విడుదల కాగా అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15, 2025 లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష మేలో జరగనుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ eximbankindia.in చూడొచ్చు.