నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఎంపీ డీకే అరుణ ఇంటిని ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించారు. పరీక్షను రీకండక్ట్ చేయాలంటూ మహబూబ్నగర్లో డీకే అరుణ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. దీంతో డీకే అరుణ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.