సీఎం చంద్రబాబును కలవనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
By తానూరు గోపిచంద్ 67చూసినవారుఏపీ సీఎం చంద్రబాబుని నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్లు కలవనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో వచ్చిన వరదలకు తమ వంతుగా ఎన్టీఆర్, చరణ్ చెరో రూ. 50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన చెక్కులను నేడు సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఇవ్వనున్నట్లు సమాచారం. కొంతకాలంగా టీడీపీతో దూరంగా ఉంటున్న తారక్ చంద్రబాబును కలవటానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.