రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి

582చూసినవారు
రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి 2024 లోక్‌సభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె 2004లో బాపట్ల నియోజకవర్గం నుండి తొలిసారి, 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. ఆమె యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేసింది.

సంబంధిత పోస్ట్