ప్రసవం కోసం నిండు గర్భిణీ పొట్టని కాలుతో తొక్కిన నర్సులు.. శిశువు మృతి

58చూసినవారు
ప్రసవం కోసం నిండు గర్భిణీ పొట్టని కాలుతో తొక్కిన నర్సులు.. శిశువు మృతి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఇద్దరు నర్సులు పాశవికంగా డెలివరీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రేణుక అనే గర్భిణికి నర్సులు వైద్యం చేయగా, మగబిడ్డ జన్మించిన గంటల్లోపే చనిపోయాడు. తనని నర్సులు బూతులు తిట్టారని, నొప్పులు రావాలని పొట్టపై కాలుతో తొక్కారని రేణుక చెప్పారు. వైద్య సిబ్బంది నిరక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని రేణుక భర్త ఆరోపించారు.

సంబంధిత పోస్ట్