అధికారిక ప్రకటన.. అన్ని రకాల మిలిటరీ చర్యలు నిలిపివేత

64చూసినవారు
అధికారిక ప్రకటన.. అన్ని రకాల మిలిటరీ చర్యలు నిలిపివేత
భారత్‌–పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరు దేశాలు అన్ని రకాల మిలిటరీ చర్యలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అధికారికంగా ప్రకటించారు. కాల్పులు, ఎయిర్‌ఫోర్స్ దాడులు సహా అన్ని మిలిటరీ చర్యలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇరుపక్షాల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని, మే 12 మధ్యాహ్నం మరిన్ని చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్