ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రజెంటేషన్‌ ఇచ్చిన అధికారులు

78చూసినవారు
ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రజెంటేషన్‌ ఇచ్చిన అధికారులు
ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఇటీవలే రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై ఈ సందర్భంగా అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్