'ఆపరేషన్ సిందూర్'లో భారత విజయాన్ని ప్రతిబింబించేలా ఒడిశా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత శిల్పం రూపొందించారు. పూరీ బీచ్పై 6 అడుగుల ఈ శిల్పంలో భారతమాత నుదుటి సింధూరం శక్తిగా మారి శత్రువును ధ్వంసం చేసిన దృశ్యాన్ని ఆకర్షణీయంగా చూపించారు. "భారత్ మాతా కీ జై.. న్యాయం లభించింది" అనే క్యాప్షన్తో ఈ శిల్పం వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.