ఆపరేషన్ సిందూర్పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటకలోని బెలగావిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారత్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్పై ప్రసంశలు కురిపించారు. సిందూర్ దేశ గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందంటూ ప్రకటించారు. ఇదే పహల్గామ్ బాధితులకు అసలైన నివాళి అంటూ పేర్కొన్నారు. అలాగే త్రివిధ దళాలను సైతం ప్రశంసించారు.