భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వల్ల పాకిస్థాన్ వైమానిక దళానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో పాక్ వైమానిక విభాగం దాదాపు 20 శాతం మౌలిక సదుపాయాలను కోల్పోయినట్టు సమాచారం. భారత మిలిటరీ యుద్ధ విమానాలపై కూడా భారత్ గట్టి దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఇండియాలో సైనిక స్థావరాలతోపాటు పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్థాన్కు భారత దళాలు గట్టిగానే బుద్ధి చెప్పారు.