భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడిందని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. శుక్రవారం ఎక్స్ వేదికగా.. జమ్మూకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లఘించినట్లు పోస్టు పెట్టింది. పాక్ క్షిపణులు, డ్రోన్లను భారత ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా, ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడి జరిపిన విషయం తెలిసిందే.