TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ది హిందూ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు ప్రశ్నలకు విడమర్చి సమాధానాలిచ్చారు.'మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మా ప్రభుత్వం విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన రంగాలపై దృష్టి సారించింది. ప్రపంచ దేశాల్లోని అగ్రగామి నగరాలతో పోటీ పడాలన్నదే మా ఆలోచన' అని అన్నారు.