నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరు కానున్నారు.