పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి దాడులు చేస్తున్న నేపథ్యంలో BSFకు కేంద్రం కీలక ఆదేశాలు జారి చేసింది. ఆ దేశ డ్రోన్ కనిపిస్తే వెంటనే కూల్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జమ్మూ సెక్టార్లోని పూంచ్, రాజౌరీ, అనంత్ నాగ్, ఆర్ ఎస్ పురాలో పాక్ సైన్యం డ్రోన్లతో దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం BSFకు ఈ ఆదేశాలిచ్చింది.