భారత్‌తో కాళ్లబేరానికొచ్చిన పాక్

52చూసినవారు
భారత్‌తో కాళ్లబేరానికొచ్చిన పాక్
భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆ తర్వాత సరిహద్దుల్లో పాక్ సామాన్యులపై కాల్పులు జరిపింది. రాత్రి వేళ డ్రోన్లతో దాడికి దిగింది. దీన్ని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఓ దశలో భారత్‌పై యుద్ధం ప్రకటించిన పాక్.. వెనక్కి తగ్గింది. భారత్‌తో యుద్ధానికి దిగితే తనకే భారీగా నష్టం కలుగుతుందని గుర్తించింది. అమెరికా సాయంతో పాక్ భారత్‌తో కాళ్లబేరానికొచ్చింది.

సంబంధిత పోస్ట్