పాకిస్తాన్ శుక్రవారం చేసిన డ్రోన్ దాడుల్లో భారత అధికారి మృతి చెందారు. జమ్మూలోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న సీఎం జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అధికారి మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా ప్రస్తుతం పాక్ ఎల్ఓసీ దగ్గర కాల్పులకు పాల్పడుతోంది.