టర్కీ, చైనా ఆయుధాలను నమ్ముకుని పాకిస్తాన్ భారత్పై దాడి చేసింది. పాక్ హడావుడిగా తెప్పించిన డ్రోన్లన్నీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బకు ధ్వంసమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ టర్కీని అడిగి డ్రోన్లను తెప్పించుకుంది. మూడు విమానాల్లో డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని టర్కీ పాక్కు పంపింది. రెండ్రోజుల క్రితం కూడా మరో టర్కీ సైనిక విమానం ఇస్లామాబాద్కు వచ్చింది. దీంతో భారత్ దెబ్బకి పాక్ దిక్కుతోచని స్థితిలో పడింది.