జమ్మూలోని 7 లొకేషన్లలో దాడులకు దిగిన పాక్

81చూసినవారు
జమ్మూలోని 7 లొకేషన్లలో దాడులకు దిగిన పాక్
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాతుంది. వరుసగా రెండోరోజు చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. జమ్మూలోని 7 లొకేషన్లలో పాక్ దాడులకు దిగింది. పూంఛ్ సెక్టార్‌లో భారీగా దాడులు జరుపుతున్న పాకిస్తాన్.. తంగదార్, పంచ్ గామ్‌లలో డ్రోన్లతో దాడి చేస్తోంది. దీంతో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లైంది. జమ్మూ, సాంబా సెక్టార్, పఠాన్ కోట్‌లో డ్రోన్లను భారత్ కూల్చివేస్తోంది. జమ్మూకశ్మీర్‌లో హైఅలెర్ట్ నెలకొంది.

సంబంధిత పోస్ట్