భారత సైన్యం ఆపరేషన్ సిందూర్తో రగిలిపోతోన్న దాయాది దేశం.. సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఉక్రోషంతో సామాన్య పౌరులపై పాకిస్థాన్ దాడిచేస్తోంది. శుక్రవారం ఉదయం ఉరి సెక్టార్లో పౌరులే లక్ష్యంగా దాడిచేసింది. ఈ దాడిలో 10 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగానే బదులిస్తోంది.