ఉరీలో మరోసారి పాకిస్థాన్ దాడి

56చూసినవారు
ఉరీలో మరోసారి పాకిస్థాన్ దాడి
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో రగిలిపోతోన్న దాయాది దేశం.. సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఉక్రోషంతో సామాన్య పౌరులపై పాకిస్థాన్ దాడిచేస్తోంది. శుక్రవారం ఉదయం ఉరి సెక్టార్‌లో పౌరులే లక్ష్యంగా దాడిచేసింది. ఈ దాడిలో 10 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగానే బదులిస్తోంది.

సంబంధిత పోస్ట్