జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో డ్రోన్లతో పాకిస్థాన్ దాడికి దిగింది. శుక్రవారం రాత్రి రాజౌరిలో అధికారులు బ్లాక్అవుట్ విధించారు. రాత్రి వేళ పాక్ డ్రోన్లతో దాడికి దిగగా.. భారత ఆర్మీ వాటిని కూల్చేందుకు కాల్పులు జరిపింది. ఆకాశంలో పెద్ద పేలుళ్ల శభ్దాలు వినిపిస్తూ.. ఎర్రటి గీతలు కనిపించాయి. ఆ వీడియో ట్విట్టర్ ఎక్స్లో వైరల్ అవుతోంది.