దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో బీసీసీఐ వారం పాటు ఐపీఎల్ మ్యాచ్ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడుతూ.. త్వరలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తామని, ఎక్కువ రోజులు ఒత్తిడి తట్టుకునే అంత సీన్ పాకిస్తాన్కు లేదని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లో మన ప్లేయర్స్తో పాటు విదేశీ ప్లేయర్లు ఉన్నారని, వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.