భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నాలుగో రోజు కూడా దాయాది దేశం దుశ్చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్లోని నౌషోరిలో పాక్ దళాలు కాల్పులు తీవ్రతరం చేశాయి. ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ సైన్యం కొనసాగిస్తున్న దాడులకు భారత ఆర్మీ సమర్థవంతంగా కౌంటర్ ఫైర్ ఇస్తోంది. అధికారులు పరిస్థితిని గమనిస్తున్నారు.